ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా గతనెల జనవరి 13 న ఆరంభమైంది. ఈ రోజు 29వ రోజు. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న ముగియనున్న మహా కుంభమేళాకు జన ప్రవాహం పెరుగుందే కానీ తగ్గటం లేదు. రద్దీ ఉన్నప్పటికీ తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానమాచరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రయాగ్రాజ్ చుట్టు పట్ల వందల కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కుంభమేళా ప్రాంగణంలో రద్దీ కారణంగా నిమిషాల్లో వెళ్లగలిగే ప్రాంతాలకు కూడా గంటల సమయం పడుతోంది.
![]() |
![]() |