ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక మొత్తాన్ని అంథాకారంలోకిి నెట్టిన కోతి...ఇంతకి ఏం చేసింది

national |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 08:06 PM

కోతుల గురించి అవి చేసే రచ్చ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊరికే వెళ్తున్న వారిపై విరుచుకు పడుతూ.. రచ్చ చేసే కోతులను చూస్తే ధైర్యంగా ఉండే వాళ్లకంటే భయపడే వాళ్లే ఎక్కువ. అదే ఒకటీ, రెండు కోతులు మాత్రమే ఉంటే పెద్దగా భయపడకుండా ఏ రాయో, కట్టెనో తీసుకుని వెళ్లగొడుతుంటారు. అవి కూడా జనాలు ఎక్కువ ఉంటే జంకుతుంటాయి. కానీ తాజాగా ఓ కోతి మాత్రం దేశ ప్రజలందరినీ ముప్పు తిప్పలు పెట్టింది. అది చేసిన ఓ పని వల్ల శ్రీలంక దేశ వ్యాప్తంగా కరెంట్ బంద్ అయింది. ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


శ్రీలంకలో ఫిబ్రవరి 9వ తేదీ రోజు అంటే ఆదివారం.. దేశవ్యాప్తంగా కరెంట్ బంద్ అయింది. ఒక్కసారిగా దేశం మొత్తం విద్యుత్ నిలిచిపోవడంతో.. ప్రజలు అంతా తీవ్ర సమస్యలు ఎదుర్కున్నారు. ఆసుపత్రులు, కార్యాలయాల్లో పనులన్నీ నిలిచిపోయాయి. ముఖ్యంగా అత్యవసరం అనుకున్న వాళ్లంతా జనరేటర్లనపైనే ఆధార పడాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలకు కరెంట్ పోగా.. రాత్రయినా రాలేదు.


విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. సదరు ఆఫీసర్లకు ప్రజలు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. అలాగే అనేక మంది సోషల్ మీడియా వేదికగా కరెంటు లేదంటూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. దీనిపై స్పందించి శ్రీలంక ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అసలు సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు పెద్ద ఎత్తునే చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు శ్రమించగా.. కరెంటు పోవడానికి గల కారణాన్ని కనుక్కున్నారు.


అయితే ఇదే విషయాన్ని శ్రీలంక విద్యుత్ శాఖ మంత్రి కుమార జయకోడి తెలిపారు. ముఖ్యంగా ఒక కోతి తమ గ్రిడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకిందని.. దాని వల్లే వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడి దేశ వ్యాప్తంగా కరెంట్ కట్ అయిందని చెప్పుకొచ్చారు. ఈ విషయం విన్న ప్రజలు అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు.


కొలంబోలోని ఒక సబ్ స్టేషన్‌లోకి ప్రవేశించిన కోతే.. దేశ వ్యాప్తంగా విద్యుత్ పోవడానికి కారణమా అంటూ ఓ నెటిజెన్ తన మనసులోని ప్రశ్నను అడిగాడు. అలాగే మరో వ్యక్తి.. ఒక కోతి=మొత్తం గందరగోళం అంటూ రాసుకొచ్చారు. శ్రీలంక జాతీయ విద్యుత్ గ్రిడ్ చాలా బలహీనమైన స్థితిలో ఉందని.. ఏ ఒక్క లైన్‌లో సమస్య ఏర్పడినా దేశ వ్యాప్తంగా విద్యుత్ స్తంభించిపోతుందని ఓ ఇంజినీర్ వివరించాడు. 2022లో ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంక విస్తృతంగా విద్యుత్ సరఫరాను కోల్పోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com