టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అంటూ వస్తున్న ఆరోపణలలో ఉన్న రెండో నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ2 నిందితుడైన ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్కు ఆరోగ్యం బాగాలేదని పేర్కొంటూ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన 2 ఏడీఎం కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్.. ఏపీపీ జయశంకర్కు నోటీసులు జారీచేశారు. బెయిల్ మంజూరు చేయవద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేసిన ఏపీపీ.. కౌంటర్ ఫైల్ చేయడానికి నాలుగు రోజులు వ్యవధి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆ మేరకు కోర్టు ఏపీపీకి గడువు ఇచ్చింది.
![]() |
![]() |