తిరుమలలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న 67,192 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 20,825 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
![]() |
![]() |