రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మంగళవారం ప్రశ్నించారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సమీక్ష చేసే ఓపిక ప్రజాప్రతినిధులకు లేదా అని మండిపడ్డారు. వ్యాపారులు, దళారులకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, 9 నెలలు తిరక్కుండానే రూ.1. 26 లక్షల కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు.
![]() |
![]() |