ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్లు మృతిచెందడంపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఏపీ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ (బుధవారం) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని అన్నారు. పూర్తి స్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని సూచించారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మేజర్స్ అమలు చేయాలని అన్నారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
![]() |
![]() |