జిడిఆర్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాలు ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, అవగాహన కల్పించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, గజ్వేల్ షీ టీమ్ బృందం. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు.
ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సామాజిక రుగ్మతల గురించి చదువుపై దృష్టి పెట్టి 10 జిపిఏ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు డిపార్ట్మెంట్ తరపున ఘనంగా సన్మానించి రివార్డు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శిల్పారెడ్డి, ఉపాధ్యాయులు, గజ్వెల్ షీటీమ్ బృందం శ్రీరాములు ఏఎస్ఐ, కానిస్టేబుల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |