ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటినుండో తెలుసా...

Education |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 11:34 PM

మార్చి నెల ప్రారంభమైంది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా ఎండ వేడిమి నుంచి కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక స్కూల్ విద్యార్థులు ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ స్కూళ్లతోపాటు ప్రయివేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com