మంగళసూత్రం ధరించని, బొట్టు పెట్టుకోని భార్య పట్ల ఏ భర్త అయినా ఎందుకు ఆసక్తి చూపిస్తారంటూ పూణే జిల్లా న్యాయమూర్తి ఓ మహిళను ప్రశ్నించారు. భర్త తనపై గృహ హింసకు పాల్పడుతున్నట్లు కేసు పెట్టి.. విడాకులు కోరిన మహిళ కేసులో న్యాయమూర్తి మధ్యవర్తిగా వ్వవహరించారు. ఈక్రమంలోనే ఈ షాకింగ్ కామెంట్లు చేయగా.. ఓ న్యాయవాది వీటిని సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ కుటుంబ న్యాయస్థానం వద్దకు.. ఓ మహిళ వెళ్లింది. తన భర్త తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని విడాకులు కావాలంటూ పిటిషన్ వేసింది. అయితే గతేడాది మార్చిలో ఈ కేసు విచారణకు రాగా.. న్యాయమూర్తి మధ్యవర్తిగా వ్యవహరించారు. భార్యాభర్తలు ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎన్.పీ సింగ్.. సదరు మహిళతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. నీవు మంగళ సూత్రం ధరించలేదు, కనీసం బొట్టు కూడా పెట్టుకోవడం లేదు.. ఇలాంటప్పుడు నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపాలని ప్రశ్నించారు.
అయితే ఈ విషయాన్ని ఇదే కేసులో న్యాయవాదిగా ఉన్న జహంగీర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2024 మార్చి 1వ తేదీన న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వుల్లో.. సదరు మహిళ బొట్టు పెట్టుకోలేదని, మంగళ సూత్రం కూడా ధరించలేదని అంగీకరించందని చెప్పుకొచ్చారు. అలాగే బొట్టు అనేది ప్రతీ భార్య యొక్క మతపరమైన విధి అని.. దాన్ని బట్టే ఓ స్త్రీ వివాహిత అని అంతా గుర్తిస్తారన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శుభం శర్మ మాట్లాడుతూ.. తన క్లయింట్ 2017లో వివాహం చేసుకున్నారని.. ఆ దంపతులకు 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వివరించారు.
ప్రస్తుతం న్యాయమూర్తి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరేమో స్త్రీలు కచ్చితంగా బొట్టు, మంగళ సూత్రం ధరించాలని చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఎవరు ఎలా ఉండాలనేది ఎవరూ నిర్ణయించకూడదని అంటున్నారు. ఇది ఒకరి స్వేచ్ఛను హరించడమే అవుతుందంటూ వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa