ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.3400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా రికార్డ్

national |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 07:56 PM

దేశంలోనే అత్యం ధనిక, పేద ఎమ్మెల్యేలు ఎవరో తెలిసిపోయింది. ముఖ్యంగా వీరిద్దరూ భారతీయ జనతా పార్టీకి చెందిన వారే కాగా.. ఒకరి వద్ద 3400 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. మరొకరి వద్ద కేవలం 1700 రూపాయలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మరి అత్యధిక ఆస్తులు కల్గిన.. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఎవరు, అత్యంత పేద ఎమ్మెల్యే ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన విశ్లేషణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా రికార్డు సాధించారు. ముంబయిలోని తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మొత్తంగా రూ.3400 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఆయన వద్ద ఉన్నాయని తెలుస్తోంది.


అలాగే సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెండో స్థానంలో ఉన్నట్లు కూడా ADS వెల్లడించింది. అయితే ఇతడి వద్ద మొత్తంగా 1413 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు వివరించింది. ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా రికార్డు సాధించారు. అయితే ఈయన ఆస్తుల విలువ కేవలం రూ.1700 మాత్రమే కావడం గమనార్హం.


అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో గుర్తించదగిన వ్యక్తులు వీళ్లే..!


ఎన్.చంద్రబాబు నాయుడు (ఏపీ ముఖ్యమంత్రి) - రూ.931 కోట్లు


వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఏపీ మాజీ ముఖ్యమంత్రి) - రూ. 757 కోట్లు


కేహెచ్ పుట్టస్వామి గౌడ (కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యే) - రూ.1267 కోట్లు


ప్రియాకృష్ణ (కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే) - రూ.1156 కోట్లు


పి.నారాయణ (ఏపీ టీడీపీ ఎమ్మెల్యే) - రూ.824 కోట్లు


వి.ప్రశాంతి రెడ్డి (ఏపీ టీడీపీ ఎమ్మెల్యే) - రూ.716 కోట్లు


టాప్ 10 అత్యంత సంపన్నుల ఎమ్మెల్యేల జాబితాలో ఏపీకి చెందిన నలుగులు ఎమ్మెల్యేలు ఉండగా.. టాప్ 20 అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. అలాగే హిందూపూర్ ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ సహా ఏడుగురు శాసన సభ్యులు కూడా ఉన్నారు.


ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4092 ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి వారిపై ఉన్న కేసులను విశ్లేషించింది. దస్త్రాలు సరిగ్గా స్కాన్ చేయకపోవడం వల్ల 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించలేకపోయినట్లు ఏడీఆర్ చెప్పింది. అలాగే మరో 7 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa