ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంచ్ మార్క్ అధిగమించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు...

business |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 09:50 PM

పిఎల్  వెల్త్ మేనేజ్మెంట్, పిఎల్ క్యాపిటల్   వెల్త్ మేనేజ్మెంట్ విభాగం మ్యూచువల్ ఫండ్ పనితీరు విశ్లేషణలో తాజా అధ్యయనాన్ని వెల్లడించింది. సెక్టోరల్/థీమాటిక్ ఫండ్లను మినహాయించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్   జనవరి, 2025లో ₹24,85,843.60 కోట్ల నుండి ఫిబ్రవరి, 2025లో 6.97% తగ్గి ₹23,12,570.67 కోట్లకు చేరిందని పేర్కొంది. 294 ఓపెన్-ఎండ్ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్లను విశ్లేషించిన ఈ అధ్యయనంలో, 54.08% ఫండ్లు ఫిబ్రవరి 28, 2025లో వాటి బెంచ్మార్క్లను అధిగమించాయి. ఈ పీరియడ్లో మొత్తం 159 ఫండ్లు మెరుగైన పనితీరును నమోదు చేశాయి. స్మాల్ క్యాప్ ఫండ్లు అత్యుత్తమ పనితీరు కనబరిచాయి, 79.31% స్కీములు తమ బెంచ్మార్క్ను అధిగమించాయి. వీటి తరువాత, ఫోకస్డ్ ఫండ్స్ 67.86% మరియు లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్స్ 65.63% ఉత్తమ పనితీరుతో నిలిచాయి.  లార్జ్ క్యాప్ ఫండ్లు 21.88% నిధులతో తక్కువ పనితీరు కనబరిచిన ఫండ్ కేటగిరీగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com