ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ వద్ద రూ.2000 నోట్లు ఉన్నాయా.. అయితే మీకో శుభవార్త..

business |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 11:19 PM

మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని వెలికి తీసే క్రమంలో 2016 నవంబర్ 8వ తేదీన కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో రూ.1000, రూ.500 పాత నోట్లు ఆ రోజు నుంచి మార్కెట్లో చలామణి నిలిచిపోయాయి. అప్పటికే ప్రజల వద్ద ఉన్న ఆ నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ సమయం ఇచ్చింది. బడా బాబుల నుంచి గ్రామీణ ప్రజల వరకు ఇంట్లో ఒక్క నోట్ ఉన్నా బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. అదే సమయంలో కొత్త నోట్లను కూడా ఆర్బీఐ ప్రకటించింది. రూ.500 నోట్లతో పాటు.. రూ.2000 నోట్లను ముద్రించింది. వీటితో పాటు.. తర్వాత కొత్తగా రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200 వంటి నోట్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది.


అయితే 2023 మే 19న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2వేల నోట్ల చెలామణిలో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో మళ్లీ.. ఈ నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చింది. దీనికి 2023 అక్టోబర్‌ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను డిపాజిట్‌ చేయడం లేదంటే మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.


అయితే మొదట నోట్ల రద్దు సమయంలో ఇబ్బందిపడినట్లుగా ప్రజలు ఈ నోట్ల రద్దుతో ఇబ్బంది పడలేదు. చాలా మంది వద్ద ఈ రూ.2000 నోట్లు అందుబాటులో లేకపోవడమే కారణం. అయితే నేటికి రూ.2000 నోట్లు 98.21 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ఇంకా ప్రజల వద్దనే రూ.రూ.6,366 కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మొత్తం ముద్రించిన రూ.2000 నోట్ల విలువ రూ.3.56లక్షల కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా పేర్కొంది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే మొదలైంది. ఈ సందర్భంగా ఆర్బీఐ ఈ నోట్ల గురించి తెలిపింది.


2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్పిడి చేసుకోవడానికి అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకు శాఖలలో సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే.. ఈ సౌకర్యం ఇప్పటికీ ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇంకా ఎవరి వద్దనైనా ఈ నోట్లు ఉంటే.. దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా ఆర్బీఐ జారీ చేసిన ఏ కార్యాలయానికైనా రూ. 2,000 నోట్లను పంపవచ్చు. దీని వలన వ్యక్తులు ఆర్బీఐ కార్యాలయాలను స్వయంగా సందర్శించాల్సిన అవసరం లేకుండానే వారి బ్యాంకు ఖాతాలకు తమ నోట్లను జమ చేసుకోవచ్చు. 2,000 నోట్లను సాధారణ చలామణి నుండి ఉపసంహరించుకున్నప్పటికీ.. ఈ నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com