ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తహవూర్ రాణాకు లగ్జరీ ఏర్పాట్లు అందించడం లేదు,,,ఎన్ఐఏ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 09:44 PM

26/11 ముంబయి ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవూర్ రాణాను గురువారం రోజు అమెరికా నుంచి భారత దేశానికి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఆయనకు పోలీసులు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారో తెలుసుకోవాలని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా గతంలో కసబ్‌ను జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి పోషించిన అధికారులు.. ఇప్పుడు తహవూర్ రాణాకు మాత్రం లగ్జరీ ఏర్పాట్లు అందించడం లేదు. ముఖ్యంగా 14 X 14 అడుగుల సెల్‌లో ఉంచి 24 గంటలూ గమనిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఇన్నాళ్లూ అమెరికాలో ఉన్న తహవూర్ రాణాను భారత్ విజయవంతంగా ఇక్కడకు తీసుకు రాగలిగింది. గురువారం రోజు అర్ధరాత్రి రాణాను ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్డి ముందు హాజరు పరిచారు. ఆ సమయంలో కేసుతో సంబంధం లేని వ్యక్తులు అందరినీ బయటకు పంపించి వేశారు. ఆపై విచారణ జరపగా.. రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరింది. దీంతో న్యాయమూర్తి 18 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు. దీంతో అధికారులు అతడిని 18 రోజుల పాటు ఓ ప్రత్యేక సెల్‌లో ఉంచి విచారించబోతున్నారు.


ముఖ్యంగా ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్ ప్రాంతం మొత్తాన్ని ఎన్ఐఏ అధికారులు కట్టుదిట్టం చేశారు. భారీ భద్రతను ఏర్పాటు చేసి మరీ అక్కడి ఓ కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్ఐఏ భవనంలో రాణాను ఉంచారు. ముఖ్యంగా ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న చిన్న గదిలోనే అతడికి వసతి ఏర్పాట్లు చేశారు. కేవలం 14 X 14 అడుగుల వైశాల్యంతో ఉన్న చిన్న గదిలోనే కింద ఓ బెడ్డు వేసి అతడు పడుకోవడానికి వసతి కల్పించారు. అలాగే అందులోనే ఓ బాత్రూం కూడా ఉండగా.. తాగేందుకు నీళ్లు, ఆహారాన్ని సైతం అక్కడికే తీసుకెళ్లి ఇవ్వబోతున్నారు. అయితే బిర్యానీ వంటి లగ్జరీ ఐటమ్స్ కాకుండా సాధారణ భోజనాన్ని మాత్రమే అతడికి అందిస్తున్నారు.


అంతేకాకుండా తహవూర్ రాణాపై 24 గంటలు నిఘా ఉంచేందుకు.. గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ గదిలో వివిధ అంచెల్లో డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి.. కొందరు మాత్రమే లోపలికి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం 12 మంది ఎన్ఐఏ అధికారులు మాత్రమే తహవూర్ రాణా ఉన్న సెల్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa