వేటపాలెం మండలం పందిళ్ళపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని సజ్జా దివ్యశ్రీ బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలలో 600 మార్కులకు 596 మార్కులు సాధించి విజయ కేతనం ఎగరేశారు.
బాపట్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇవే అత్యధిక మార్కులు కావడం విశేషం. ఇదే పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు 589 మొదలు 587 వరకు మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం సదరు విద్యార్థులను అభినందించింది.
![]() |
![]() |