వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు మంచినీటి, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు, కళామందిర్ కూడలిలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాలను ప్రారంభించిన ప్రత్తిపాటి, వేసవిలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు.
![]() |
![]() |