ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం,,,తమిళనాడు ప్రజారోగ్య శాఖ కీలక ఉత్తర్వు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 07:59 PM

ఆహార ప్రియులు ఎంతగానో మెచ్చి, లొట్టలేసుకుంటూ మరీ తినే మయోనైజ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఇది దేశవ్యాప్తంగా కాదులెండి. ఒక్క తమిళనాడులోనే. ఆ రాష్ట్రం మాత్రమే మయోనైజ్‌పై నిషేధాన్ని విధించింది. ముఖ్యంగా దీని తయారీ, ప్యాకేజింగ్, అమ్మకాలను సంవత్సర కాలం చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. మయోనైజ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కావడంతో పాటు ఆరోగ్యానికి ప్రమాదమని ప్రజారోగ్య శాఖ తెలిపింది. అయితే దీన్ని ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు కూడా వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


తాజాగా తమిళనాడు ప్రజారోగ్య శాఖ కీలక ఉత్తర్వును జారీ చేసింది. అందులో మయోనైజ్ తయారీ, స్టోరేజీ సరిగ్గా లేకపోవడంతో అనేక క్రిములు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది. దీంతో ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతుందని.. ముఖ్యంగా సాల్మోనెల్లా టైపిమురియం, సాల్మోనెల్లా ఎంటర్ లైడిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద ఈ నిషేధం విధించామన్నారు.


అసలు సమస్య ఎక్కడ వస్తోంది..?


మయోనైజ్‌ను పచ్చి గుడ్డులోని తెల్ల సోన, నూనె, వెనిగర్ లేదా నిమ్మరసంతో కలిపి బాగా కలియతిప్పి తయారు చేస్తారు. దీన్ని ఎక్కువగా షవర్మా, మండి బిర్యానీ, పిజ్జాలు, బర్గల్లు, శాండ్ విచ్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్‌లకు చెట్నీలా వాడుతూ ఇష్టంగా తింటుంటారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని పదార్థాల తయారీకి కూడా మయోనైజ్‌ను వాడుతుంటారు. అయిదే దీన్ని పచ్చి పదార్థాలతో తయారు చేయడం, స్టోరేజీ సరిగ్గా చేయకపోవడం వల్ల క్రిములు, బ్యాక్టీరియా తయారు అవుతున్నాయి. ముఖ్యంగా ప్రమాదకర సాల్మనెల్లా బ్యాక్టీరియా వృద్ధి చెంది.. తిన్నవాళ్ల ప్రాణాలనే తీసే స్థాయికి చేరుకుంటుంది.


ఇది మాత్రమే కాకుండా దీన్ని తయారు చేసేటప్పుడు కొందరు చెడిపోయిన గుడ్లను కూడా వాడుతున్నారు. మరికొందరు అయితే అపరిశుభ్రమైన చేతులు, పరిస్థితుల్లో దీన్ని తయారు చేస్తుండగా.. ఫలితంగా మరింత సమస్య ఏర్పడుతుంది. ఈక్రమంలోనే తమిళనాడు ప్రజారోగ్య శాఖ అప్రమత్తమై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజలు ఎక్కడైనా హోటళ్లలో దీని చూసినా.. అస్సలే తినకూడదని, కొనుగోలు కూడా చేయకూడదని.. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచించింది. ఇప్పటికే తెలంగాణలో ఈ మయోనైజ్‌పై నిషేధం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com