ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మృతిచెందిన వారికీ రూ. 25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 10:58 AM

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున అందించనున్నట్టు తెలిపింది. గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com