శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం ఆయన ఈ ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఘటనాస్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
![]() |
![]() |