ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:03 AM

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘ‌ట‌న‌ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. బాధితుల‌ను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంద‌ని, అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. అంద‌రూ ధైర్యంగా ఉండాల‌ని కోరారు. అనంత‌రం ఆయ‌న‌ ఈ ఘ‌ట‌న గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఘ‌ట‌నాస్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని తెలిపారు. ఈ దుర్ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌న్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com