సింహాచలం దుర్ఘటనపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో ఉన్న ఏడుగురు భక్తుల మృతి బాధాకరమన్నారు. స్వామివారి చందనోత్సవ సమయాన ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలానే ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
![]() |
![]() |