అయోధ్య రామమందిర శిఖరంపై అక్షయ తృతీయ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయింది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.42 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ శుక్లపక్ష ద్వితీయ ముహూర్తంలో ఉదయం 8 గంటలకు ప్రతిష్ఠించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. సంబంధిత ఫోటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.రామమందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని, రామ్ దర్బార్లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
![]() |
![]() |