ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలు బేష్.. త్వరలోనే డీల్: ట్రంప్

international |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:44 PM

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు అద్భుతంగా కొనసాగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌పై 26 శాతం విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసి, వ్యాపార ఒప్పందాలపై చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే వైట్‌హౌస్ వెలుపల మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘నా అభిప్రాయం ప్రకారం మనం భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటాం’ అని చెప్పారు. అలాగే, మోదీ పర్యటన సందర్భంగా ఒప్పందం గురించి ఇరువురి మధ్య జరిగిన చర్చను గుర్తుచేుశారు. అమెరికా-భారత్ మధ్య ఒప్పందం సిద్ధంగా ఉందని, కానీ భారత ప్రధాని, పార్లమెంట్ ఆమోదం కోసం వేచి చూస్తున్నామని అమెరికా వాణిజ్య మంత్రిహోవార్డ్ లుట్నిక్ తెలిపారు. అయితే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.


అంతకుముందు అమెరికా ట్రెజరీ మంత్రి స్కాట్ బెస్సెంట్ కూడా ‘భారత్‌తో వాణిజ్య ఒప్పందం చాలా దగ్గరలో ఉంది’ అని తెలిపారు. అమెరికాతో మొదటగా ఒప్పందం కుదుర్చుకునే దేశాల్లో భారత్ ఒకటి కావచ్చని.. అది ఈ వారం లేదా వచ్చే వారం జరిగే అవకాశం ఉదని చెప్పారు. ట్రంప్ యంత్రాంగం మాత్రం ఇప్పటికే చర్చల కోసం ఒక రోడ్‌మ్యాప్‌పై అంగీకారానికి వచ్చినట్టు తెలిపాయి. ఇదిలా ఉండగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునే దేశాలకు చైనా వార్నింగ్ ఇచ్చింది.


భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం


రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ‘భారత్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాకు అరుదుగా ఇచ్చే “ఫార్వర్డ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్” (MFN) జాబితాలో చేర్చాలని భావిస్తోంది.. ఈ క్లాజ్ ప్రకారం భారత్ ఇతర దేశాలపై వర్తించే తక్కువ సుంకాలు అటోమేటిగ్గా అమెరికాకు వర్తిస్తాయి. ఇది ఒప్పందాన్ని భవిష్యత్‌లో మరింత ముందు తీసుకెళ్లే విధంగా పనిచేస్తుంది’.


ఇదే సమయంలో, అమెరికాతో కీలక రంగాలలోనూ (అలాగే వ్యవసాయ రంగంలోనూ) ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపింది. మొత్తం 24 అంశాల్లో 19ను తొందరగా చర్చించేందుకు ఎంపిక చేశారు. మిగిలిన ఐదు అంశాలు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు (సోయా, మక్క మొదలైనవి), రక్షణ సామగ్రి ఉన్నాయి.


అమెరికాపై ఉత్పత్తులపై భారత్ తగ్గించే సుంకాలు:


ఫ్రోజెన్ మాంసం, చేపలు, పౌల్ట్రీ, పండ్లు, జ్యూస్ వంటి వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌ను 0%–5%కి తగ్గించేందుకు ప్రతిపాదన. ప్రస్తుతం వీటిపై టారిఫ్‌లు 30%–100% మధ్య ఉన్నాయి. మొత్తం 12,000 టారిఫ్ లైన్లలో 90 % వాటికి తక్షణ సడలింపు ఇవ్వగలమని భారత అధికారి పేర్కొన్నారు. మిగతా టారిఫ్ లైన్లపై దశలవారీగా సడలింపులు ఇవ్వవచ్చని చెప్పారు..


ఇక, వస్త్ర పరిశ్రమ, బొమ్మలు, లెదర్ వస్తువులు, ఫర్నిచర్, ఆభరణాలు, ఆటోమొబైల్ విఢి భాగాలు మొదలైన రంగాలపై సుంకాలపై వెసులుబాటు కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు వంటి రంగాల్లో అమెరికన్ సప్లై చెయిన్‌లో కీలక భాగస్వామిగా మారేందుకు దీర్ఘకాలిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. 90 రోజుల సుంకాల విరామం జూలైలో ముగియనున్న నేపథ్యంలో, ట్రంప్ యంత్రాంగం వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని కోరుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com