మహారాష్ట్రలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. లోనావాలా సమీపంలో ముంబై-పుణే నేషనల్ హైవేపై 20 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. కొన్ని కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఓ ట్రక్ బ్రేక్ ఫెయిల్యూరే ఈ ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa