ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్న శవాన్ని అమ్మ, అంకుల్ డ్రమ్ముల్లో పడేశారు.. మహిళను పట్టించిన బాలుడి సాక్ష్యం

Crime |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 10:37 PM

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ.. అతడి శవాన్ని డ్రమ్ములో పడేసిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌లో చోటుచేసుకుంది. అయితే, వారి ఎనిమిదేళ్ల కుమారుడి సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారింది. నీళ్లకోసం వాడే డ్రమ్మును ఖాళీచేసి.. నాన్నను చంపి శవాన్ని అందులో అంకుల్ పడేయడం తాను చూశానని బాలుడు పోలీసులకు చెప్పాడు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన హన్స్‌రాజ్.. కొద్ది రోజుల కిందట తన భార్య సునీత్, ముగ్గురు పిల్లలతో రాజస్థాన్‌‌లోని అల్వాల్‌కు వచ్చి అక్కడ ఇటుక బట్టీల్లో పనికి కుదిరాడు. అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని భార్య, పిల్లలతో ఉంటున్నాడు.


ఈ క్రమంలో ఇటుక బట్టీకి భూమి లీజుకు ఇచ్చిన మహిళ కుమారుడి జితేంద్ర శర్మతో సునీతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి అక్రమ సంబంధం గురించి హన్స్‌రాజ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య తరుచూ గొడవ జరుగుతుండేది. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు జితేంద్ర శర్మ, సునీత పథకం వేశారు. ఆగస్టు 15న ముగ్గురూ కలిసి మద్యం సేవించి.. ముందుగా అనుకున్న ప్రకారం హన్స్‌రాజ్‌ను హత్యచేసి.. డ్రమ్ములో పడేశారు. అనంతరం జితేంద్ర, సునీతలు ముగ్గురు పిల్లలను తీసుకుని అక్కడ నుంచి పరారయ్యారు. అయితే, ఇటుక బట్టీ యజమాని ఇచ్చిన సమాచారంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను వారి బంధువులకు అప్పగించారు.


డ్రి హన్స్‌రాజ్‌‌ను హత్య చేసిన రోజు ఏం జరిగింది? అనేది బాలుడు వివరించాడు. ‘నాన్న, అమ్మ, అంకుల్ ముగ్గురూ కలిసి మద్యం సేవించారు.. అమ్మ కొద్ది మోతాదులోనే తాగింది..కానీ, నాన్న, అంకుల్ మాత్రం ఫుల్లుగా తాగారు.. మద్యం మత్తులో అమ్మను నాన్న కొట్టబోతుంటే అంకుల్ అడ్డుకున్నారు.. దీంతో ఆగ్రహించిన నాన్న ఆమెను కాపాడితే నిన్ను చంపుతా అని అంకుల్‌ను బెదిరించాడు.. దీంతో నాన్నపై దాడిచేశాడు’ అని వెల్లడించాడు. ‘‘నన్ను నిద్రపొమ్మని అమ్మచెప్పింది.. కొద్దిసేపటి తర్వాత లేచిచూసేసరికి నాన్న పడుకుని ఉన్నాడు.. మళ్లీ నిద్రలోకి జారుకున్నాను.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ మేల్కొని చూస్తే నాన్న మంచంపై ఉన్నాడు..


అంకుల్, అమ్మ కంగారుపడుతున్నారు.. యజమాని నాన్న గురించి అడిగి, పోలీసులకు చెబుతాన్ని బెదిరించడంతో మమ్మల్ని ఇటుక బట్టీకి తీసుకెళ్లాడు.. కానీ ఇటుక బట్టీ యజమాని సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు’ అని తెలిపాడు. డ్రమ్ములో నీళ్లు పారబోసి, అందులో శవాన్ని వేసి.. వంటగదిలో పెట్టేశారని ఆ చిన్నారి వెల్లడించాడు. అయితే, తనను కూడా నాన్న కొట్టేవాడని, ఒకసారి బ్లేడుతో గొంతుకోయడానికి ప్రయత్నించాడని వివరించాడు. తన తల్లికి సిగరెట్‌తో వాతలు పెట్టినట్టు కూడా చెప్పాడు. కాగా, ఈ ఘటన కొద్ది రోజుల కిందట ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన మర్చంట్ నేవీ అధికారి హత్యను తలపించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa