ఈ తెల్లవారుజామున దక్షిణ అమెరికా భూభాగం ఒక భారీ భూకంపంతో కుదేలైంది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం చిలీ సమీపంలో తెల్లవారుజామున 2:16 నిమిషాలకు నమోదైంది. దీని తీవ్రత భారీగా ఉండటంతో పరిసర ప్రాంతాల్లో భయానక అనుభవాలు నెలకొన్నాయి.
భూకంప కేంద్రంగా అర్జెంటీనాలోని సదరన్ సిటీ ఉషుయ్కు దక్షిణ దిశగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనలు డ్రెక్ ప్యాసేజ్ పరిసరాల వరకు ప్రభావం చూపించాయి. భూకంప శక్తి కారణంగా అక్కడి మంచు ఫలకాలు తారుమారు కావడం గమనార్హం.
దీని ప్రభావం అంటార్కిటికా వరకూ విస్తరించడంతో అక్కడి మంచు గడ్డలు కదలికలకు లోనయ్యాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, భూకంప ప్రభావం వల్ల సముద్రపు అలలు మారగలవన్న ఉద్దేశంతో, సునామీ ముప్పు ఉన్నదిగా హెచ్చరికలు జారీ చేశారు.
చిలీలో పలు నివాసాలు దెబ్బతిన్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతను బట్టి మరిన్ని ప్రభావాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa