ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ విజయోత్సవాల్లో తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 05:36 PM

ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇలాంటి విషాదకర ఘటనలు జరిగినప్పుడు ఏ నాయకుడూ బాధ్యత వహించి రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ప్రతిపక్ష నేత ఆర్. అశోక నేతృత్వంలో బీజేపీ, జేడీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.శుక్రవారం నాడు అసెంబ్లీలో ఈ ఘటనపై ప్రకటన చేసిన సిద్ధరామయ్య, ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. "గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 20 తొక్కిసలాట ఘటనలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవి ఆలయంలో 162 మంది, రాజస్థాన్‌లోని చాముండాదేవి ఆలయంలో 250 మంది, ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా సమయాల్లో బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అప్పుడు ఎవరైనా బాధ్యత తీసుకున్నారా రాజీనామా చేశారా" అని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో జరిగిన ఘటనలను కూడా ఆయన ఉదహరించారు.ఘటన జరిగిన రోజు తాను ఏం చేశారో వివరిస్తూ, "నా 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి విషాదం చూడలేదు. ఈ ఘటన నన్ను ఇప్పటికీ కలచివేస్తోంది. ఆ రోజు సాయంత్రం 5:30 గంటల వరకు మరణాల గురించి నాకు తెలియదు. లండన్ నుంచి వచ్చిన మనవడిని తీసుకుని విధానసౌధ వద్ద ఆర్సీబీ ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి వెళ్లాను. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రులకు వెళ్లి మృతదేహాలను చూసి తీవ్రంగా చలించిపోయాను" అని సిద్ధరామయ్య తెలిపారు.ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతూ, "ఈ ఘటనపై వెంటనే మేజిస్టీరియల్ విచారణకు, ఆ తర్వాత జ్యుడీషియల్ కమిషన్‌ విచారణకు ఆదేశించాం. ఐదుగురు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశాం. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్  క్రిమినల్ కేసులు నమోదు చేసి, కేసును సీఐడీకి అప్పగించాం. కేవలం క్షమాపణ చెబితే న్యాయం జరగదు, చర్యలు తీసుకుంటేనే జరుగుతుంది. మా బాధ్యతలను మేము నిర్వర్తించాం" అని స్పష్టం చేశారు.అయితే ముఖ్యమంత్రి సమాధానంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. "అసలు అనుమతి లేని కార్యక్రమానికి ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది ఉపముఖ్యమంత్రి శివకుమార్ అక్కడకు ఎందుకు వెళ్లారు అని ప్రతిపక్ష నేత అశోక ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి తనకు ఆ విషయం తెలియదని బదులిచ్చారు. కార్యక్రమాన్ని 10 నిమిషాల్లో ముగించాలన్న పోలీసుల అభ్యర్థన మేరకే తాను అక్కడికి వెళ్లానని డీకే శివకుమార్ వివరణ ఇచ్చారు.ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడానికి నిరాకరించి, కేవలం విచారం మాత్రమే వ్యక్తం చేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామని అశోక ప్రకటించారు. దీంతో బీజేపీ, జేడ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa