ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మృతి మంధాన నిశ్చితార్థం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోడీ

sports |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 01:20 PM

టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన అభిమానులకు తీపి కబురు చెప్పింది. తన ప్రియుడు, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో నిశ్చితార్థం జరిగినట్లు ఆమె ధ్రువీకరించింది. సహచర క్రీడాకారిణులు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి చేసిన ఓ ఇన్‌స్టా రీల్‌లో తన వేలికి ఉన్న నిశ్చితార్థం ఉంగరాన్ని చూపిస్తూ ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది.స్మృతి ఈ విషయాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి. కాబోయే జంట స్మృతి-పలాశ్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఓ సందేశం పంపింది. ఈ సందేశం ప్రకారం ఈ నెల 23న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ తేదీపై మంధాన గానీ, పలాశ్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.గత కొంతకాలంగా స్మృతి, పలాశ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. పలుమార్లు వీరిద్దరూ కలిసి బయట కనిపించారు. మంధాన ఆడే ముఖ్యమైన మ్యాచ్‌లకు పలాశ్ హాజరై ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు. బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పలాశ్ పలు సినిమాలకు పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa