ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొయ్యలగూడెం శివారు పులి వాగు వద్ద గాడాల నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న బైక్ను ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనల జయరాజు (52), సత్యవతి (45) అనే దంపతులు మరణించారు. మనవరాలి అన్నప్రాసనానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa