ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ రైళ్లలో ప్రయాణించేవారికి .... ఇక నుంచి సరికొత్త అనుభూతి

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 08:39 PM

భారతీయ రైల్వేలు తమ సెమీ హై స్పీడ్ రైళ్లు అయిన వందే భారత్ రైళ్లలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. వందే భారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఆయా ప్రాంతాలకు చెందిన ప్రత్యేకమైన స్థానిక వంటకాలతో కూడిన మెనూను అందించనున్నారు. ఈ వినూత్న నిర్ణయం ద్వారా.. ప్రయాణికులు ఆ రైలు ప్రయాణించే మార్గంలోని వైవిధ్యమైన సాంస్కృతిక, ఆహార అభిరుచులను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్ ఛైర్ కార్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. తొలి దశలో వందే భారత్ రైళ్లలో అమలు చేసిన తర్వాత.. ఈ నిర్ణయాన్ని దేశంలోని మిగిలిన రైళ్లు అన్నింటికీ విస్తరించడానికి ఇండియన్ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది.


భోజన నాణ్యత మెరుగుదలకు పీఓసీ ట్రయల్స్


రైలు ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతను మరింత మెరుగుపరచడంపై భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా.. ఎంపిక చేసిన కొన్ని వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీఓసీ) భోజన ట్రయల్స్‌ను మొదలుపెట్టింది.


ఈ పీఓసీ ట్రయల్స్ ద్వారా కిచెన్ మౌలిక సదుపాయాలు, ఆహారం ఎలా తయారు చేస్తున్నారు, భోజనాన్ని ఎలా తీసుకువస్తున్నారు, సప్లై చైన్ అంతటా సేవలను అందించడం వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ఫుడ్ తయారీ, సేవలను వేరు చేస్తూ.. ఇండస్ట్రియల్ కిచెన్‌లు, రెస్టారెంట్ చైన్‌లు, ఫ్లైట్ క్యాటరర్‌లు వంటి బ్రాండెడ్ ఆహార అండ్ పానీయాల సంస్థలను భాగస్వామ్యం చేసి.. ప్రయాణికులకు తాజా, పరిశుభ్రమైన భోజనాన్ని అందించడానికి ఐఆర్‌సీటీసీ ప్రయత్నాలు చేస్తోంది.


వందే భారత్ రైలు ప్రత్యేకతలు


ఈ వందే భారత్ రైలు.. గంటకు 180 కిలోమీటర్ల డిజైన్.. గంటకు 160 కిలోమీటర్ల ఆపరేటింగ్ వేగంతో పరుగులు తీస్తుంది.


దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థను వందే భారత్ రైళ్లను అనుసంధానం చేశారు.


దేశీయంగా అభివృద్ధి చేసిన్ యూవీసీ ల్యాంప్ ఆధారిత క్రిమిసంహారక వ్యవస్థతో కూడిన ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు.


కుదుపులు లేకుండా సెమీ పర్మనెంట్ కప్లర్‌లు, మెరుగైన రైడ్ కంఫర్ట్.


సెంట్రల్‌ కంట్రోల్ చేసే ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, పూర్తిగా సీల్ చేయబడిన గ్యాంగ్‌వేలు, అన్ని కోచ్‌లలో సీసీటీవీలు.


ఎలక్ట్రికల్ క్యాబినెట్‌లు, టాయిలెట్‌లలో ఏరోసోల్ ఆధారిత అగ్ని ప్రమాద గుర్తింపు, అణచివేత వ్యవస్థ.


ప్రతి చివరన ఉన్న డ్రైవింగ్ కోచ్‌లలో దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు.


డ్రైవర్ గార్డ్ వాయిస్ రికార్డింగ్ సౌకర్యంతో కూడిన కమ్యూనికేషన్ అండ్ క్రాష్ హార్డెన్డ్ మెమరీ.


కోచ్ కండిషన్ మానిటరింగ్ సిస్టమ్, రిమోట్ మానిటరింగ్‌తో కూడిన డిస్‌ప్లే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa