ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాక్ యుద్ధం ఆపినా గుర్తింపు దక్కలేదు: ట్రంప్ ఆవేదన

international |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 12:18 PM

భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణను తానే ఆపానని, అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, కానీ ఆ దేశాల పేర్లు ఎవరికీ తెలియవని, భారత్-పాక్ గొడవను కూడా తానే సెటిల్ చేశానని, దీనికి నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వలేదని నెతన్యాహు వద్ద తన ఆవేదనను వెళ్లగక్కారు. అయితే, భారత్ మాత్రం ఈ వాదనను ఖండిస్తూ, మే నెలలో జరిగిన కాల్పుల విరమణ కేవలం ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ల (DGMO) మధ్య జరిగిన చర్చల ఫలితమేనని, మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa