ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి ఓ స్టీల్ బ్రిడ్జి సహా మూడు బ్రిడ్జిలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 08:09 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా అమరావతికి రోడ్డు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టారు.. రాజధానికి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు మూడో దశ పనులు మొదలయ్యాయి.. 3.51 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో 3 కిలోమీటర్లు ఎలివేటడెర్ కారిడార్ ఉంది. ఈ మూడో ఫేజ్ రోడ్డు రోడ్డు ప్రకాశం బ్యారేజీ దగ్గర మొదలవుతుంది.. మణిపాల్ ఆస్పత్రి దగ్గర (ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణం చేస్తున్నారు) నేషనల్ హైవే 16 (చెన్నై-కోల్‌కతా)లో కలుస్తుంది. మధ్యలో గుంటూరు ఛానల్, కొండివీడు వాగు, బకింగ్ హాం కాలువల్ని దాటాల్సి ఉంటుంది.


ఈ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డును ఫేజ్-3 వ్యయం రూ.512 కోట్లు కాగా.. కొండవీటివాగు, గుంటూరు ఛానల్‌పై 262 మీటర్ల పొడవైన బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. ఆ తర్వాత 100 మీటర్ల రోడ్డు.. అనంతరం ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. బకింగ్‌హామ్‌ కెనాల్‌పై ఆర్చ్‌ బ్రిడ్జి ఉంది.. ఆర్చ్‌ బ్రిడ్జి నుంచి రైల్వే లైన్‌ దాటే వరకు బ్రిడ్జి ఎత్తులో ఉంది.. దానిని ఎక్స్‌ట్రాడోస్‌ బ్రిడ్జిగా పిలుస్తారు. బకింగ్‌హాం కాలువపై స్టీల్‌బ్రిడ్జి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జికి సంబంధించి విడి భాగాలను హైదరాబాద్‌‌లో తయారు చేయించి ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్టీల్ గడ్డర్లు అమరుస్తున్నారు.. నాలుగు వరుసలుగా 110 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.


కొండవీటివాగు, గుంటూరు ఛానళ్లపై వంతెనలు నిర్మిస్తున్నారు.. స్టీల్‌బ్రిడ్జితో సీడ్‌యాక్సెస్‌ రోడ్డును అనుసంధానిస్తూ ఒక రోడ్డు ప్లాన్ చేశారు. ఈ స్టీల్‌బ్రిడ్జి మీదుగా సీడ్‌యాక్సెస్‌ రోడ్డులోకి విజయవాడ నుంచి, మంగళగిరి వైపు నుంచి రాజధానిలోకి వెళ్లొచ్చు. కొండవీటి వాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జిలు.. స్టీల్‌ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ఫస్ట్ సీడ్ యాక్సెస్ రోడ్డును ఓల్డ్ జీటీ రోడ్డు కనెక్ట్ చేస్తారు. మార్చి నెలాఖరు వరకు స్టీల్‌బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు. మే నెలాఖరుకు కొండవీటి వాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.


అమరావతికి సీడ్‌యాక్సిస్ రోడ్డు ప్రధానమైనది.. దీని మొత్తం పొడవు 21.78 కి.మీ. మొదటి దశలో 14.35 కిలోమీటర్లు రోడ్డు పూర్తి చేశారు. రెండో దశలో భూసమీకరణ సమస్యల్ని దాటుకుని నిర్మాణ పనులు వేగవంతం చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్-1, ఫేజ్-2లను తొమ్మిది వరుసలుగా నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జిలు పూర్తి చేసి సీడ్ యాక్సెస్ రోడ్డును పాత జీటీ రోడ్డుతో కనెక్ట్ చేస్తే రద్దీ కూడా తగ్గుతుంది అంటున్నారు. సీడ్‌యాక్సెస్‌ రోడ్డు ఫేజ్‌-3 పూర్తి చేసి నేషనల్ హైవే 16తో కనెక్ట్ చేస్తే అమరావతికి దూసుకెళ్లొచ్చు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa