ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ప్రభుత్వంలో దళితులకు, మైనారిటీలకు న్యాయం జరగటం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 02:58 PM

దళితులు, మైనార్టీలపై దాడులకు వైసీపీ ప్రభుత్వం చిరునామాగా మారిందంటూ అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ ధ్వజమెత్తారు. దాడులను నిరసిస్తూ...ఛలో విజయవాడలో పాల్గొనేందుకు సీపీఐ ఆఫీస్‌ నుంచి రైల్వేస్టేషనకు వెళ్తున్న సీపీఐ నాయకులను సోమవారం పోలీసులు అరెస్టుచేసారు. ఈ సందర్భంగా జాఫర్‌ మాట్లాడుతూ....  దళితులు, మైనార్టీలను గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే దళితులు, మైనార్టీల హత్యలు జరిగాయంటూ విమర్శలు గుప్పించారు. అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాలను ఈ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. కార్యక్రమం మల్లికార్జున, ఫిరోజ్‌, శ్రీరాములు, లింగమయ్య, పెద్దయ్య,రమణ, అల్లిపీరా, బంగారు బాషా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa