ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఫేల్ కొనుగోలును సమర్థించిన ఐఏఎఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 12, 2018, 12:05 PM

న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలును భారత వైమానిక దళం సమర్థించింది. రాఫేల్ కొనుగోలుపై వివాదం నెలకొనడంతో.. ఈ అంశంపై ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. ఎమర్జెన్సీ కింద 36 రాఫేల్ జెట్లను కొనుగోలు చేయడం అవసరమని ఆయన అన్నారు. రాఫేల్‌తో పాటు ఎస్-400 రక్షణ ఆయుధాలతో వైమానిక దళాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. వైమానిక దళంలో తగ్గుతున్న సంఖ్య కొరతను తీర్చేందుకు రాఫేల్ ప్రొక్యూర్‌మెంట్ అవసరమన్నారు. 2016లో పారిస్ వెళ్లిన మోదీ.. అక్కడ రాఫేల్ విమానాల కోనుగోలుపై ఒప్పందం కుదుర్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa