ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పునః ప్రారంభం కానున్న వారాహి యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2023, 03:04 PM

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (నేడు) నుంచి 4వ విడత వారాహి విజయ యాత్ర చేపట్టనున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో 5 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. అవనిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం 3 గంటలకు భారీ బహరంగసభ జరగనుంది. కాగా జనసేన, తెలుగుదేశం కలిసే ఎన్నికలకు వెళ్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించిన అనంతరం నిర్వహిస్తున్న వారాహి యాత్ర కావడంతో ఈ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు వారాహి యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం నేతలకు, కార్యకర్తలకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa