భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే ఓ గొప్ప స్థానం ఉంది. భార్యాభర్తలు నూరేళ్లు తోడూనీడగా ఒకరికి ఒకరు జీవించాలని కోరుకుంటూ పెద్దలు పెళ్లిళ్లు జరిపిస్తూ ఉంటారు. అనుకోని కారణాల వలన అందులో కొన్ని మధ్యలోనే విడిపోతుంటాయి. విభేదాల కారణంగా కొంతమంది విడిపోతే.. విధి కొన్ని జంటలను దూరం చేస్తుంది. అలా భాగస్వామి దూరమైన తర్వాత వితంతువుగా మిగిలి ఒంటరి ప్రయాణం సాగించడం చాలా కష్టం. అందులోనూ పిల్లలు ఉంటే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రెండో పెళ్లిని ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.
సమాజంలో రెండో పెళ్లి అంటే చిన్నచూపుగా చూస్తుంటారు. సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో సంకెళ్లు వేస్తుంటారు. అలాంటి సంకెళ్లను తెంపి.. ఒంటరిగా మిగిలిన వితంతువులకు మరో జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో ఝార్ఖండ్ ప్రభుత్వం" విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన" అనే పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది.
అందులో భాగంగా మొదటి భర్త డెత్ సర్టిఫికేట్ను, రెండో పెళ్లికి సంబంధించిన మ్యారేజీ సర్టిఫికేట్ను అర్హులైన మహిళలు అధికారులకు సమర్పిస్తే.. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేస్తున్నారు. అయితే ఇందుకు ఝార్ఘండ్ ప్రభుత్వం ఒక నిబంధన అమలు చేస్తోంది. రెండో పెళ్లి చేసుకున్న ఏడాది లోపే ఈ సర్టిఫికేట్లను సమర్పించిన వారికి మాత్రమే రెండు లక్షల సాయం అందిస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకీ, పెన్షన్లు తీసుకునేవారికీ, ఆదాయపన్ను చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa