చంద్రబాబు ఆదేశాలతో సీఎం వైయస్ జగన్ పై టీడీపీ నేత బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా, ఎల్లోమీడియాలో దుష్ప్రచారాలు చేశారు. ఇది చాలా బాధాకరం. మీకు మీరే రాయి వేయించుకున్నారు అనడం అత్యంత దారుణమన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ..... ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం కార్యక్రమం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ వస్తే.. ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ప్రజలు విశేష స్పందన చూపడంతో ఆ కార్యక్రమం చాలా విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక బాధాకర, దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి టీడీపీ నాయకులు పన్నాగం పన్ని హత్యాయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారిపైకి బలమైన రాయి విసరడం, ఆయన తలకు గాయం కావడం..కుట్లు పడటం అందరికీ తెలుసు. పక్కనే ఉన్న నాకు కూడా ఆ రాయి తగలడంతో నా కన్ను దెబ్బతింది. వారం రోజులైనా ఇంకా కోలుకోలేదు. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా, ఎల్లోమీడియాలో దుష్ప్రచారాలు చేశారు. ఇది చాలా బాధాకరం. మీకు మీరే రాయి వేయించుకున్నారు అనడం అత్యంత దారుణం. సిద్ధం సభల నుంచి మేమంతా సిద్ధం కార్యక్రమం వరకూ ప్రజల స్పందన చూడండి. ఎవరైనా చావు కొనితెచ్చుకుంటారా? దేహంలో అన్నిటి కంటే ముఖ్యమైన కంట్లో చిన్న నలకపడితేనే తట్టుకోలేం. అటువంటిది రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగంగా మాట్లాడటం, హేళన చేయడం బాధాకరం. బొండా ఉమా, చంద్రబాబు, ఆయన తొత్తుల మాటలను మీడియాలో చూస్తున్నాం. బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారు..అది జరిగితే జూన్4న మీ అంతు చూస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక, బొండా ఉమా, పట్టాభిలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక సారి ఆలోచన చేస్తే ఈ సంఘటనలో టీడీపీ వారి హస్తం ఉందో లేదో వాళ్ల నొటి వెంటే వాస్తవాలు వచ్చాయి అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa