మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స.. జగన్కు తండ్రి సమానులు అంటూ ఓ వార్తను ఈరోజు ఉదయం పేపర్లో చూశానని.. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ... ‘‘ఇదే బొత్స వైఎస్సార్ను త్రాగుబోతు అని తిట్టాడు. ఇదే బొత్స జగన్కు ఉరి శిక్ష వేయాలని అన్నాడు. జగన్ మోహన్ రెడ్డి బినామీలు అన్నాడు. విజయమ్మ ను సైతం అవమాన పరిచాడు. ఇలాంటి బొత్స జగన్కు తండ్రి సమానులు అయ్యారు’’ అంటూ ఎద్దేవా చేశారు.