ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 2 నుండి టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 07:03 PM

టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు-2019 ప్రారంభోత్సవం ఫిబ్రవరి 2వ తేదీ శ‌నివారం ఉదయం 9.00 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనం వైనక వైపు గల పరేడ్‌ మైదానంలో జరుగనుంది. ఈ పోటీలు ఫిబ్రవరి 17వ తేదీ వరకు జరుగనున్నాయి.ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. ఉద్యోగులందరూ పాల్గొని ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టిటిడి కోరుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa