ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎంలపై ఈసీని కలుస్తాం: రాహుల్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 09:01 PM

ఈవీఎంల అంశంపై 4వ తేదీ సాయంత్రం ఎన్నికల కమిషన్ ను కలుసుకోనున్నట్టు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో విపక్ష నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ,. వచ్చే సోమవారం నాడు విపక్ష నేతలు ఈసీని కలిసి ఈవీఎంల అంశంపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై రాహుల్ మాట్లాడుతూ, 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసిన మీరు (మోదీ) రైతులకు రోజుకు రూ.17 రూపాయలు మాత్రమే ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇది రైతులను అవమానించడం కాదా?' అని అన్నారు. రైతులు, నిరుద్యోగం, రాజ్యాంగ సంస్థలపై దాడులు, రాఫెల్ తదితర అంశాలు వంటివే ఎన్నికల పోరాటంలో ప్రధాన అంశాలన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ట్రయిలర్ మాత్రమేనని, ఎన్నికల తర్వాత అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు వెళ్తామని ప్రధాని మోదీ అభివర్ణించగా, ఇది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టే అని, చివరి మాటల గారడీ బడ్జెట్ అని కాంగ్రెస్ పెదవి విరించింది.
ఈవీఎంలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని చంద్రాబాబు నాయుడు చెప్పారు. ఓటరు ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈవీఎంలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీయేతర నేతల సమావేశంలో ఈవీఎంలపై చర్చించామని తెలిపారు. ప్రజస్వామ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే అంశం పై చర్చ జరిగిందన్నారు. సబ్ కమిటీ రిపోర్ట్‌పై చర్చించి, ఆమోదించామన్నారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చిస్తామని స్పష్టం చేశారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య రైతుల సమస్య. 4 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ వృద్ధి కేవలం 2.4 శాతం మాత్రమేనన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించాం. ఏపీ లో కాంగ్రెస్ తో ముందుకు వెళ్ళేదే లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa