కడప జిల్లా, చెన్నూరులోని లలితాంబికా సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. మండల వ్యాప్తంగా ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం యంత్రప్రతిష్ఠ, ధ్వజప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ అనంతరం ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. పూర్ణాహుతి గావించారు. ఈ సంసదర్భంగా శివపార్వతుల ఉత్సవ మూర్తులకు వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ విస్తీర్ణత తక్కువ అయినా మహిళలు ఆలయం వెలుపల ఇబ్బందికరంగా కూర్చుని కళ్యాణం వీక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa