రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ‘యాత్ర’కు సిద్ధమవుతున్నారు. ఈ సారి బస్సుయాత్ర చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే తన బస్సు యాత్రను ప్రారంభించనున్నట్టు జగన్ తెలిపారు. కాగా, తమ పార్టీకి చెందిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జ్ లతో జగన్ సమావేశమయ్యారు. సమర్థత ఉన్న వారికే ఎన్నికల ఇంఛార్జ్ లుగా బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్ధుల ఎంపిక కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేసారాయన.