టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ కొంతకాలంగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవంటూ ఇద్దరూ ఇన్డైరెక్ట్గా చెబుతున్నా విడాకులు తీసుకోవడం ఖాయమని సోషల్ మీడియా చెబుతోంది. ధనశ్రీకి చాహల్ రూ.60 కోట్ల భరణం చెల్లించనున్నాడనే వార్త తాజాగా షికార్లు కొడుతోంది. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అన్ఫాలో
ఇన్స్టాగ్రామ్లో చాహల్, ధనశ్రీ ఒకరినొకరు అన్ఫాలో కూడా చేసుకున్నారు. ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ చాహల్ డిలీట్ చేయగా, ధనశ్రీ మాత్రం వాటిని తన ఇన్స్టాలో అలానే ఉంచింది. అప్పటివరకు రూమర్స్ గానే తీసుకున్న అందరూ అన్ఫాలో చేసుకోవడం, ఫొటోలు డిలీట్ చేయడంతో డివోర్స్ కంపల్సరీ అని ఫిక్స్ అయ్యారు. 2020లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఇలా విడిపోవడం అందర్నీ బాధిస్తోంది. టీమిండియాలో చోటు కోల్పోవడం.. తర్వాత వైవాహిక జీవితంలో ఇలా జరగడంతో చాహల్ మానసికంగా బలహీనమయ్యాడు.
ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇటీవలే ధనశ్రీ ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కొన్ని రోజులుగా ఆధారాలు లేని వార్తలు, ఫేస్ పోస్టులతో తన గౌరవాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నా మౌనం నా బలహీనతే కాదు అదే నా బలం అని చెప్పింది. కొన్నేళ్లుగా తాను సంపాదించుకున్న పేరును నెగిటివిటీతో తీసేస్తున్నారని, కానీ నిజానికి విలువెక్కువ.. ఓం నమ:శివాయ అని ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. చాహల్ కూడా బయటకొస్తున్న వార్తలు నిజాలు కాకపోవచ్చంటూ ఓ పోస్ట్ చేశాడు.
కొరియోగ్రాఫర్
యూట్యూబర్గా, కొరియోగ్రాఫర్గా, డెంటిస్ట్గా యుజ్వేంద్ర చాహల్ అందరికీ బాగా పరిచయం. యూట్యూబ్ వీడియోలతో ధనశ్రీ బాగా ఫేమస్ అయింది. డాన్స్ వీడియోలు చేస్తూ యూత్లో క్రేజ్ తెచ్చుకుంది. ప్రముఖ డాన్సింగ్ షో ఝలక్ ధిక్లాజాలో కూడా కంటెస్టెంట్గా చేసింది. త్వరలోనే యష్ మాస్టర్ హీరోగా వస్తున్న ఆకాశం దాటి వస్తావా అనే సినిమాతో టాలీవుడ్లో కూడా అడుగుపెట్టబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa