ఎండాకాలం పీక్ స్టేజీకి చేరుకుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో నీరు తాగడం, బాగా హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. అయితే, చాలా మంది ఎండల వేడికి తట్టుకోలేక రిఫ్రిజిరేటర్లోని చల్లని నీరు తాగుతారు. చల్లని నీరు తాగడం వల్ల కాస్త రిలీఫ్ అనిపించవచ్చు. వేసవిలో నీటి కొరతను నివారించడానికి ప్రజలు వివిధ డ్రింక్స్ తాగుతారు. వీటిలో లస్సీ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఉంటాయి.
శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి నిపుణులు నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు తాగాలని వైద్యులు సిఫార్స్ చేస్తారు. అయితే గోరు వెచ్చని నీరు లేదా మట్టి కుండ నీరు తాగాలని సలహా ఇస్తారు. ఇవి మీ ఆరోగ్యానికి హాని కలిగించవు. అయితే, ఫ్రిజ్లోని కూల్ వాటర్ తాగడం వల్ల తీవ్రమైన దుష్ర్పభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. చాలా మంది ఎండల్లో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లోని కూల్ వాటర్ తాగుతారు. అయితే, ఇలా చేయడం పెద్ద పొరపాటు అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్లోని కూల్ వాటర్ తాగడం వల్ల కలిగే సమస్యలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మలబద్ధకం సమస్య
ఎండల వేడికి తట్టుకోలేక ఫ్రిజ్ నుంచి కూల్ వాటర్ తాగడం వల్ల మలబద్ధక సమస్య వచ్చే ప్రమాదం ఉంది. చల్లటి నీరు తాగినప్పుడు ఆహారం శరీరంలోకి ప్రవేశించినప్పుడు గట్టిగా మారుతుంది. పేగులు కుంచించుకుపోతాయి. దీని వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హృదయ స్పందన రేటు తగ్గుతుంది
వేసవిలో రిఫ్రిజిరేటెడ్ నీటిని ఎక్కువగా తాగితే, అది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఫ్రిజ్లోని కూల్ కూల్ వాటర్ తాగడం వల్ల పదవ కపాల నాడి (వాగస్ నాడి) ఉత్తేజితమవుతుంది. శరీరం యొక్క అసంకల్పిత చర్యలను నియంత్రించడానికి నరాలు పనిచేస్తాయి. చల్లటి నీరు వేగస్ నాడిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది.
తలలో నొప్పి మొదలవుతుంది.
ఎండల్లో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడి ఎదుర్కోని నేరుగా వచ్చి చల్లని లేదా ఐస్ వాటర్ తాగితే మీకు తలనొప్పి రావచ్చు. నిజానికి, చల్లటి నీరు తాగడం వల్ల వెన్నెముకలోని అనేక నరాలు చల్లబడతాయి. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తలనొప్పి వస్తుంది.
బరువు పెరగవచ్చు
మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, రిఫ్రిజిరేటెడ్ నీరు తాగడం మానేయాలి. రిఫ్రిజిరేటెడ్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు గట్టిపడి బరువు తగ్గకుండా నిరోధించవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు, వ్యాయామాలు చేసే వారు కూల్ వాటర్ తాగడం మానుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సమస్యలు కూడా వస్తాయి
* చల్లటి నీరు తాగడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలను కలిగిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు చల్లటి నీరు తాగడం ద్వారా కూడా జ్వరం రావచ్చు.
* చల్లటి నీరు తాగడం వల్ల జలుబు లేదా గొంతు నొప్పి వస్తుంది. ముఖ్యంగా శరీరం ఇప్పటికే వేడిగా ఉంటే, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
* చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల దంతాల సున్నితత్వం పెరుగుతుంది. పంటి నొప్పి వస్తుంది. కావిటీస్ ఉన్నవారు చల్లని నీరు తాగడం వల్ల సమస్య ఎక్కువ అవతుంది.
![]() |
![]() |