ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబాయిలో కుప్పకూలిన పుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

national |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 11:25 PM

ముంబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్‌ (సీఎస్‌టీ) సమీపంలోని ఓ పుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఆకస్మాత్తుగా కూలిన సంఘటనలో నలుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. సీఎస్‌టీ ప్లాట్‌పామ్‌-1కు వెళ్లే పాదాచారుల వంతెన ఒక్కసారిగా రాత్రి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందారు. వంతెన కుప్పకూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa