ప్రస్తుతం భారత్లో ఆధార్ అనేది ముఖ్యమైన ధ్రువీకరణ పత్రం. భారతీయుల జీవితాల్లో ఒక భాగమైపోయింది. గుర్తింపు కోసం ఇప్పుడు ఎక్కడైనా ఆధార్ కార్డునే అడుగుతున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డుల నుంచి రేషన్ సరుకుల వరకు, ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఏది కావాన్ని ఆధార్ అథెంటికేషన్ కావాల్సిందే. అలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రభుత్వం ఆధార్ దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఆధార్ దుర్వినియోగం చేసిన వారిపై తీసుకుంటోంది. పెనాల్టీలతో పాటు కొన్నిసార్లు జైలు శిక్ష సైతం వేసే అవకాశం ఉంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేయడంతో ఎవరికైనా ఆధార్ నంబర్ లభిస్తే ఖాతాలోని నగదు తీసుకుంటారేమో అనే సందేహం ఉంటుంది. కానీ, అలాంటిదేమీ జరగదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం గుర్తింపును నిర్ధారించుకునేందుకు ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం దుర్వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇక్కడ మనం తెలుసుకుందాం.
రూ.3 ఏళ్ల జైలు శిక్ష..
ఆధార్ ఎన్రోల్ మెంట్ సమయంలో తప్పుడు బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ సమాచారం అందించడం నేరం. ఒకరికి బదులుగా ఒకరి వేలి ముద్రలు, వివరాలు ఇవ్వడం చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. అలాగే రూ.10 వేల ఫైన్ పడుతుంది. రెండూ విధించవచ్చు. ఆధార్ కార్డుదారుడిని వివరాలు మార్చి అతడి గుర్తింపును స్వాధీనం చేసుకునేందుకు ఆధార్ అప్డేట్ చేసేందుకు ప్రయత్నించడమూ శిక్షార్హం. అలా చేస్తే 3 ఏళ్ల జైలు, రూ.10 వేల ఫైన్ పడొచ్చు. ఒక్కోసారి రెండూ పడతాయి. అలాగే ఆధార్ కార్డుదారుడి గుర్తింపు వివరాలను సేకరించడమూ నేరమే. అలా చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల ఫైన్ ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీ వివరాలు సేకరిస్తే రూ.1 లక్ష వరకు పెనాల్టీ పడుతుంది. ఆధార్ నమోదు సమయంలో సేకరించిన వివరాలను ప్రైవేట్ వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా అందించడం నేరం. అలా చేసే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. రూ.10 వేల ఫైన్ కట్టాల్సి వస్తుంది. కంపెనీ అయితే రూ.1 లక్ష ఫైన్ కట్టాలి.
వారికి 10 ఏళ్ల జైలు శిక్ష..
సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రెస్పిటరీని ఎలాంటి అనుమతిలేకుండా యాక్సెస్ చేయడం, హ్యాకింగ్ చేయడం వంటివి శిక్షార్హం. అలాంటి వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10లక్షల జరిమానా ఉంటుంది. అలాగే డేటాను మార్చే ప్రయత్నం చేసినా 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa