తిరుమలలో సీఆర్వో అభివృద్ధి, ఆకాశగంగ, పాపవినాశనం ఆధునీకరణపై టీటీడీ ఈవో జె శ్యామలరావు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి సంబంధిత నిపుణులు తాము రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) ఆధునీకరణపై కూడా ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తులకు దర్శనం, వసతి గదులు సహా ఇతర అత్యాధునిక సౌకర్యాలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఆర్వో చుట్టు పక్కల ఉన్న ఖాళీ ప్రాంతాలను కూడా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చి దిద్దేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల పర్యావరణ, ఆధ్యాత్మిక అభివృద్ధి రూప కల్పన చేయాలి అన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశాల్లో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీఈ సత్యనారాయణ, అర్బన్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ నిపుణులు రాముడు ఇతర అధికారులు పాల్గొన్నారు.
జూన్ నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. 'జూన్ 02 నుంచి 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు జూన్ 01వ తేదీ సాయంత్రం అంకురార్పణంజూన్ 20, జూన్ 27 తేదీలలో సాయంత్రం 06 గం.లకు శ్రీ ఆండాళ్ అమ్మవారు / శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఊరేగింపు. జూన్ 24న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. మే 31 నుండి జూన్ 9వ తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవం' నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
జూన్ నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. 'జూన్ 11వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం. జూన్ నెలలో దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు. జూన్ 03న పుబ్బ నక్షత్రం సందర్భంగా సా.3.30 గం.లకు స్నపనం, సా.5.00 గంటలకు గ్రామోత్సవం. జూన్ 04న ఉత్తర నక్షత్రం, సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు ప్రాకారోత్సవం. జూన్ 15న శ్రవణ నక్షత్రం, ఉ. 10.గం.లకు కళ్యాణోత్సవం, సా.05 గం.లకు గ్రామోత్సవం. జూన్ 27న పునర్వసు నక్షత్రం, మ.3.30 గం.లకు స్నపనం, సా.5.గం.లకు గ్రామోత్సవం. ప్రతి శనివారం సా. 05 గం.లకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం' నిర్వహిస్తారని టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa