ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో అరుదుగా.. శుక్రవారాల్లో సాధారణం కంటే ఎక్కువమంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 07:34 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో రికార్డు స్థాయి దర్శనాలు నమోదవుతున్నాయి. శుక్రవారం రోజున (జూన్ 13) తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం రోజున తిరుమల శ్రీవారికి టీటీడీ అభిషేక సేవ నిర్వహిస్తుంది. దీంతో శుక్రవారం రోజు తిరుమల శ్రీవారు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే సమయం తగ్గుతుంది. అభిషేక సేవ కారణంగా శుక్రవారం రెండు, మూడు గంటలు స్వామి వారి దర్శనం భక్తులకు ఉండదు. దీంతో వారంలో మిగతా రోజులతో పోలిస్తే శుక్రవారం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. శుక్రవారం కేవలం 60000 నుంచి 65 వేల మంది భక్తులు దర్శించుకోగలుగుతారు.


అయితే టీటీడీ చర్యలతో శుక్రవారం రోజు కూడా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టీటీడీ నిరంతర పర్యవేక్షణ, సిబ్బంది సమన్వయం కారణంగా ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లోని శుక్రవారాల్లో సాధారణం కంటే ఎక్కువమంది శ్రీవారి భక్తులకు దర్శన భాగ్యం కలిగించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారాల్లో అదనంగా 10000 మందికికి పైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే 15 నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని.. అయినప్పటికీ శుక్రవారాలైన మే 23వ తేదీ 74,374 మంది భక్తులు, మే 30వ తేదీ 71,721 మంది భక్తులు, జూన్‌ ఆరో తేదీన 72,174 మంది భక్తులు , జూన్‌ 13వ తేదీన 75,096 మంది శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ తెలిపింది.


ఆర్థిక బాధలు పీడిస్తుంటే.. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 24 నామాలతో స్తుతిస్తే చాలు.. మీ దగ్గర డబ్బుకి లోటుండదు!


మధ్య తరగతికి కేంద్రం రిలీఫ్.. రూ.5 లక్షల వరకు 'ఇన్సూరెన్స్'పై జీఎస్టీ తొలగింపు..?


మరోవైపు శుక్రవారం రోజున 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 36,262 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి 3.93 కోట్ల ఆదాయం వచ్చింది. ఎస్ఎస్‌డీ టోకెన్ల కలిగిన భక్తులకు 18 గంటల సమయం పట్టింది.


మరోవైపు అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. రథంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం పుణ్యాహవచనం, నవగ్రహపూజ నిర్వహించారు. ఆ తర్వాత రథారోహణం, రథాగమనం, రథోత్సవం చేపట్టారు. సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారు విహరించారు. జూన్ 15న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa