ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో దట్టమైన పొగలు..ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 02:51 PM

మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి తిరుపతికి నిన్న (ఆదివారం) రాత్రి వెళ్లవలసిన ఓ విమాన సర్వీస్లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విమానంలో దట్టమైన పొగలు స్పైస్జెట్ SG-2138 విమానం ఆదివారం రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరి తిరుపతికి వెళ్లాల్సి ఉంది. కానీ శంషాబాద్ ఎయిర్పోర్టుకు విమానం గంట ఆలస్యంగా చేరుకుంది. రాత్రి 8.30 గంటలకు వచ్చింది. అనంతరం 65 మంది ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. ఇంజిన్ స్టార్ట్ చేసి రన్వే వైపు మెల్లగా కదిలింది. ఇంజిన్లో వాసన ఈ క్రమంలో ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడం స్టార్ట్ చేశాయి. అది గమనించిన పైలట్ ATC అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇంజిన్లో ఉన్న టెక్నికల్ ఇష్యూని సరిచేశారు. ఆ తర్వాత కూడా ప్రయాణికులను సేఫ్గా గమ్యస్థానాలకు దించేందుకు మళ్లీ ఇంజిన్ స్టార్ట్ చేయగా వాసన రావడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోలన చెందారు. విమానం బయల్దేరడానికి సుమారు మూడున్నర గంటల పాటు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ప్రయాణికులను మూడుసార్లు విమానంలోకి ఎక్కించి కిందకు దించారు. ఎట్టకేలకు రాత్రి 10.54 గంటలకు విమానం తిరుపతికి బయల్దేరి క్షేమంగా వెళ్లింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa