ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రూ.800 కోట్లతో.. 4 వరుసల రహదారుల నిర్మాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 05:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రహదారులకు మోక్షం కలుగుతోంది. గుంతలమయంగా మారిన రోడ్లు. కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో పలుచోట్ల జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు కూడా చేపడుతున్నా్రు. ఇక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తెనాలిలోని రోడ్లకు మహర్దశ పట్టనుంది. తెనాలిలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. తెనాలి- మంగళగిరి రోడ్డు, తెనాలి - నారాకోడూరు రోడ్లను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా తెనాలి - మంగళగిరి, తెనాలి - నారాకోడూరు రోడ్లను విస్తరించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెలిపారు.


పీపీటీ విధానంలో రూ.800 కోట్లతో ఈ రోడ్లను నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తెనాలి- మంగళగిరి, తెనాలి - నారాకోడూరు రోడ్లను రూ.8.5 కోట్ల వ్యయంతో పునఃనిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను అస్సలు పట్టించుకోలేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. దీంతో రహదారులన్నీ గుంతలమయంగా మారాయన్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.


చంద్రబాబును గారు అనకపోతే ఊరుకోను.. అలాంటి నన్ను, లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు


ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. రోడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. రూ.1,200 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా గుంతలు లేని రహదారులు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తెనాలి ప్రజలు విజయవాడ, గుంటూరుకు వెళ్లటానికి గుంతల రోడ్ల కారణంగా పలు ఇబ్బందులు పడ్డారని మంత్రి గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రహదారి మరమ్మత్తులు చేపట్టడంతో ఇప్పుడు నాణ్యమైన రోడ్లపై వేగంగా తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు.


మరోవైపు గుంటూరు జంక్షన్‌ యార్డు ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జంక్షన్ యార్డు ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.71.63 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు అనుమతి కూడా వచ్చింది. ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియకు అవసరమైన పనులను ప్రారంభించారు. పనులు పూర్తయ్యేందుకు ఏడాది పట్టవచ్చని అంచనా. గుంటూరు జంక్షన్ యార్డు ఆధునికీకరణ పనులు పూర్తయితే 8 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వస్తాయి. దీంతో 24 బోగీలు నిలిపే సౌకర్యం, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గుంటూరు మీదుగా నడిపే వీలుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa