ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాతమాగులూరు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం పంపించిన పోలీసులు, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రాదం జరిగిన కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమైనా, బస్సు డ్రైవర్ అతివేగమైనా ఈ దుర్ఘటనకు కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్ నియంత్రణలో లోపాలు కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa