ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ ఆరోపణలని ఖండించిన భారత ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Sun, Jun 29, 2025, 02:06 PM

తమ సైనికులపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ చేసిన నిరాధార ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలంటూ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ సైన్యం చేసిన ఈ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్‌లో తమ సైనిక కాన్వాయ్‌పై శ‌నివారం జరిగిన దాడికి భారతే కారణమంటూ పాక్ సైన్యం అధికారికంగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం స్పందించారు. "వజీరిస్థాన్ దాడి విషయంలో భారత్‌ను నిందిస్తూ పాకిస్థాన్ సైన్యం చేసిన ప్రకటనను చూశాం. ఆ ఆరోపణలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆయన ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa